పని హడావుడిలో తిండిని పక్కన పెట్టేస్తాం. వేళలెలాగూ పట్టించుకోవట్లేదు… తినే తీరైనా పాటిస్తున్నారా? అందరి తర్వాతే మనం అన్న ధోరణి మనలో చాలా మందిలో ఉంటుంది. అందుకే ఆఖరకు తినడానికి మొగ్గు చూపుతాం. దీనికి తోడు కష్టపడి చేసింది వృథా అవుతుందని పిల్లలు వదిలేసినా.. కొద్దిగా మిగిలినా పొట్టలోకి చేర్చేస్తుంటాం. ఇది మంచి ధోరణి కాదు. తెలియకుండానే ఎక్కువ మోతాదులో తీసుకునే ఆహారం అనారోగ్యానికి దారి తీస్తుంది. మిగిలిందని వేయడానికి పొట్టేమీ చెత్త బుట్ట కాదు కదా! కొద్దిమొత్తంలో టిఫిన్, భోజనం చేస్తే సరిపోతుంది. పోషకాలూ అందుతాయి. ఆరోగ్యమూనూ! అలాగే వేగంగానూ తినకండి.