ఎముకలు ధృడంగా ఉండాలంటే ఆహారాలు.. వాడే విధానం
ఎముకలు బలహీనంగా అవడానికి కారణం.. కాల్షియం, ఫాస్పరస్ ఉన్న ఆహారం సరిపడా తీసుకోకపోవడం, విటమిస్ డీ లోపం కారణంగా… ఎముకలు గుల్లబారిపోవడం, రుచికోసం వాడే ఉప్పును అధికంగా తీసుకోవడం. వీటివల్ల ఎముకలు బలహీనపడతాయి. వీటిని సరిచేసుకోగలిగితే…6 నెలల్లోనే.. ఎముకలు గట్టిపడతాయి. ఎముక కణం ఒకసారి పుడితే, 25 సంవత్సరాలు బ్రతుకుతుంది. కానీ ఒక సంవత్సరం మన అలవాట్లు మార్చుకుంటే, ఎముకులు మళ్లీ గట్టిపడతాయి. విటిమిన్ D అనేది ఎండనుంచి వస్తుంది కదా.. ఈ విటమిన్ లోపించినప్పుడు..ఏం జరుగుతుందంటే.. సాధారణంగా.. మనం తినే ఆహారంలో ఉండే కాల్షియం ఒంటికి పట్టాలంటే విటమిన్ డీ అవసరం. విటమన్ డీ లోపం ఏర్పడిందంటే, మనం అరలీటర్ పాలు తాగినా.. అంతా మళ్లీ మలం ద్వారానే బయటకు వచ్చేస్తుంది….
అలా కాల్షియం ఉన్న ఆహారాలు ఏం తీసుకున్నాఒంటికి పట్టవు. అతిముఖ్యమైన అవసరం విటమిన్ డీతో ఏముంది అంటే ఎముకలు బలంగా ఉండటానికి విటమిన్ డీ అంత అవసరం. ఇంకోటి ఉప్పుకు ఎముకలకు సంబంధం ఉందని పైన చెప్పుకున్నాం. ఉప్పు వల్ల బీపీ వస్తుందని తెలుసు కానీ ఎముకల గుల్లబారతాయ్ అని చాలామందికి తెలియదు. రుచికోసం ఉప్పువేసుకుని తింటున్నాం ఇది రక్తంలోకి వెళ్తుంది. రక్తంలో అధికంగా ఉప్పు ఉంటే శరీరం ఊరుకోదు. ఆ ఉప్పును విసర్జింపచేయడానికి కిడ్నీలద్వారా పంపుతుంది, ఒట్టిగా ఉప్పు బయటకు వెళ్లలేదు. కాల్షియం తోడుంటే కానీ ఉప్పు విసర్జింపబడదు. కాబట్టి ఉప్పును విసర్జింపచేయడానికి మనం ఆహారం ద్వారా తీసుకున్న కాల్షియం బయటకువెళ్లిపోతుంది. తద్వారా రక్తంలో కాల్షియం స్థాయిలు తగ్గిపోతాయి. రక్తంలో కాల్షియం తగ్గిపోతే శరీరం ఎముకల్లో కాల్షియం తెచ్చి రక్తానికి ఇసుంది, సో ఇలా అక్కడ కాలియం పోయి ఎముకలు గులబారుతాయి.
ఎముకలు బలంగా ఉండాలంటే శరీరానికి కాల్షియం 20ఏళ్లుపై బడిన వారి నుంచి రోజుకు 450 మిల్లీగ్రాములు కాల్షియం కావాలి. 20ఏళ్ల లోపువారికి 600 మిల్లీగ్రాముల కాల్షియం కావాలి. గర్భిణీలకు, బాలింతలకు 900 మిల్లీగ్రాములు కాల్షియం కావాలి. కాల్షియం లోపిస్తే ఎముకల ఎలా తయారవుతాయంటే మంచి బెల్లం గడ్డకు చీమలు పెట్టిన బెల్లం గడ్డకు తేడా మనకు తెలిసే ఉంటుంది కదా, అలా కాల్షియం లోపించిన ఎముక చీమలు పట్టిన బెల్లం గడ్డలా ఉంటుంది. ఎముకలు బలంగా ఉండాలని చాలా మంది పాలు తాగుతారు. నీళ్లు కలపని 100 గ్రాముల గేదెపాలల్లో 220 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది.
ఆవుపాలల్లో 120 మిల్లీ గ్రాములు ఉంటుంది. పాలకంటే కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాలు ఉంటాయి. తోటకూర 100 గ్రాములు తీసుకుంటే..397 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల రాగులల్లో 344 మిల్లీగ్రాములు కాల్షియం ఉంటుంది. పొనగంటి కూరలో 510 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. మునగాకులో 440 మిల్లీ గ్రాములు ఉంటుంది. నువ్వుల్లో 1450 మిల్లీగ్రాములు, కరివేపాకు 830 మిల్లీగ్రాములు ఉంటుంది. పాలే ఎక్కువ కాల్షియం ఉందనుకుని ఉంటారుకదా..వీటిల్లో ఇంత ఎక్కువగా ఉంది. అన్నింటికంటే.. నువ్వుల్లో అధికంగా ఉంటుంది.