షుగర్ పేషంట్స్ నిజంగానే స్పెషల్ చెప్పులు వాడాలా..?
బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ పరిశోధకులు ప్రత్యేకంగా 3డీ ప్రింటెడ్ పాదరక్షలు అభివృద్ధి చేశారు. శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 3డీ ప్రింటెడ్ చెప్పులు డయాబెటిక్ రోగుల నడక తీరును నియంత్రించి, గాయాలు ఎక్కువ కాకుండా అడ్డుకొంటాయని చెప్తున్నారు. స్పెషల్ చెప్పులు ధరించాలనుకున్నప్పుడు ఇలాంటి వాటిపై దృష్టిపెట్టడం మంచిది. వైద్యుల సలహా లేకుండా ఎలాంటి స్టెప్ తీసుకోకపోవడమే ఉత్తమం. షుగర్ వ్యాధి అనేది.. ఒక శత్రువుని తెచ్చి ఒంట్లో పెట్టుకున్నట్లే.! మంచి జీవనశైలి ఉన్నంతకాలం ఆ శత్రువు మంచిగా ఉంటుంది.. లేదంటో విశ్వరూపం చూపిస్తుంది.!
డయబెటిక్ పేషంట్స్ అంటే బోలేడు రూల్స్.. ఇవి తినొద్దు, అవి తినొద్దు, ఇలా చేస్తే షుగర్ కంట్రోల్లో ఉంటుందట. ఆఖరికి వేసుకునే చెప్పులు కూడా.. డయబెటిక్ పేషెంట్స్ కోసం స్పెషల్ చెప్పులు. అసలు నిజంగా వాళ్లకు స్పెషల్ చెప్పులు అవసరమా..? డాక్టర్లు కూడా వేసుకోమనే చెప్తారు. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజైషన్ (WHO) ఏం చెప్తుందో తెలుసా..? భారత్లో 20-70 సంవత్సరాల వయసు వారిలో 8.7% మధుమేహ రోగులే ఉన్నారట వీరిలో 7 కోట్ల 70 లక్షల మందికి డయాబెటిక్ సమస్య ఉంది.
ఈ మధుమేహ వ్యాధి కారణంగా గుండెపోటు, స్టోక్, కిడ్నీ ఫెయిల్యూర్ కీళ్లనొప్పులు వంటి సమస్యలు వస్తున్నాయి. ఆ ప్రభావంతో అవయవాలు దృఢత్వాన్ని కోల్పోయి, పాదాలు దెబ్బతింటాయి. కొన్నిసార్లు పరిస్థితి ప్రాణాంతకమూ అవుతుంది. డయబెటిక్ పేషెంట్స్కు ఏదైనా గాయం అయితే అంత త్వరగా మానదు. సాధారణంగానే షుగర్ ఎక్కువయ్యే కొద్ది.. పాదాలే ఎఫెక్ట్ అవుతాయి. కొన్నిసార్లు పాదాల భాగంలో ఏదైనా దెబ్బతగిలితే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ భాగం వరకూ తీసెయ్యాల్సి వస్తుంది.