తలనొప్పితో బాధపడే వారు ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి నుదుటికి పట్టీలా వేయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. అంగశూల సమస్యతో బాధపడే వారు కొండపిండి మొక్క రసంలో జీలకర్ర చూర్ణాన్ని కలిపి వాడడం వల్ల అంగశూల సమస్య తగ్గుతుంది. ఈ ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు.

ఆకులు దొరకని వారు ఆయుర్వేదం షాప్లో దొరికే కొండపిండి ఆకు పౌడర్ తెచ్చుకుని ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ పౌడర్ వేసి మరిగించి వడగట్టి ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా 20 రోజుల పాటు తాగితే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. కొండపిండి ఆకును పప్పుగా తయారు చేసుకొని కూడా తినవచ్చు. ఈ ఆకు తినడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాస్త ఓపిక ఉంటే.. ఇలా నాచురల్గా సమస్యలను తగ్గించుకోవచ్చు.