ఆహారంలో చక్కెరను పెంచని కొన్ని ఆహారాలను తీసుకోవాలి. షుగర్ స్థాయిలను వేగంగా పెంచే కొన్ని రకాల ఆహారాలను కూడా పక్కన పెట్టాలి. స్వీట్లు, సోడా వంటి ఆహారాలకు దూరంగా ఉండండి. ఈ ఆహారాలు చక్కెరను పెంచడమే కాకుండా బరువు పెరగడానికి కూడా కారణమవుతాయి. పండ్లు తినండం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ పండ్ల రసం షుగర్ రోగుల కష్టాన్ని మరింత పెంచుతుంది. మధుమేహాన్ని నియంత్రించడానికి పండ్ల రసాలను వెంటనే మానుకోండి.డ్రై ఫ్రూట్స్ తినకూడదు. డ్రై ఫ్రూట్స్ మీ శరీరంలో డీహైడ్రేషన్ సమస్యను పెంచుతాయి.

షుగర్ సమస్యని నియంత్రించడానికి.. మందులు తీసుకోవడం.. ఒత్తిడికి దూరంగా ఉండటం ఇంకా అలాగే ఆహారాన్ని నియంత్రించడం అవసరం. కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా చక్కెర స్థాయి చాలా వేగంగా పెరుగుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉదయం ఖాళీ కడుపుతో సాధారణ రక్తంలో చక్కెర స్థాయి 70-100 mg/dl ఉండాలి. చక్కెర స్థాయి 100-125mg/dl ఉంటే అది ప్రమాదకరం. టైప్-2 డయాబెటిస్ ఉన్న రోగులు షుగర్ను నియంత్రించడానికి శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి.

ఇందుకు బదులుగా మీ ఫుడ్ మెనూలో ద్రాక్ష వంటి ఫైబర్ అధికంగా ఉండే పండ్లను చేర్చండి. తెల్లటి పిండి పదార్థాలకు బదులుగా తృణధాన్యాలు బదులుగా తృణధాన్యాలు తినండి. తెల్ల బియ్యం, తెల్ల రొట్టె, పాస్తాతో సహా తెల్ల పిండితో చేసిన అన్నింటిని పక్కన పెట్టండి. “వైట్” కార్బోహైడ్రేట్లు చక్కెరలా పనిచేస్తాయి. ఇవి వేగంగా గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి. పూర్తి కొవ్వు పాల ఉత్పత్తులను నివారించండి. తక్కువ కొవ్వు పదార్ధాలను తినండి. డయాబెటిస్ రోగులు అధిక కొవ్వు మాంసాన్ని తినకూడదు. గొడ్డు మాంసం, బోలోగ్నా, హాట్ డాగ్లు, సాసేజ్, బేకస్, రిబ్ల లో అధిక కొవ్వు ఉంటుంది. వీటిని అస్సలు తినకూడదు. ప్యాక్ చేసిన స్నాక్స్, బేక్డ్ ఫుడ్స్ తీసుకోవడం కంట్రోల్ చేయండి, ఇది మీ చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఆయిల్, బ్రెడ్ ఫ్రైడ్ ఫుడ్స్ తినడం మానుకోండి. ఇంకా ఆలు హాల్, ఆల్కహాల్ తీసుకోవడం మానుకోండి. ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.