కిడ్నీ రోగులు పసుపు తినకూడదా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి
యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉండే పసుపు అన్ని విధాలా మంచే చేస్తుంది. వంటకు పసుపు అదనపు రుచిని జోడిస్తుంది. జలుబు చేసినప్పుడు పసుపు వేసుకుని పాలు తాగడం, ఆవిరి పట్టడం వంటివి చెయ్యమని చెప్తారు పెద్దలు. ఎందుకంటే ఇండలో ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు రోగాన్ని నయం చెయ్యడంలో కీలక పాత్ర పోషిస్తాయని అంటారు. అందుకే పసుపు పాలు తాగితే జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
ఇన్ని మంచి గుణాలు కలిగిన పసుపు అతిగా వాడటం వల్ల అనార్థాలు కూడా ఉన్నాయి. పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్ ఉన్న ఈ పసుపు వల్ల కిడ్నీ, కాలేయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రతికూలతలు కూడా ఉన్నాయి. పసుపుని సూపర్ ఫుడ్ గా మార్చే ప్రధాన మూలకం కర్కుమిస్. నొప్పిని నయం చెయ్యడం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఇది ఉపయోగపడుతుంది. అయితే దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల అనేక రకాలుగా ప్రభావితం చేస్తుంది.
కిడ్నీలను ఎలా ప్రభావితం చేస్తుంది? పసుపులోని కర్కుమిస్లో అధిక మొత్తంలో ఆక్సలేట్లు ఉన్నాయి, ఇవి మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. అంతే కాదు వాటి పనీతిరుకి కూడా ఆటంకం కలిగిస్తాయి. కర్కుమిస్ వేడి శక్తిని కలిగి ఉంటుంది. దీని వల్ల తరచుగా అతిసారం, అజీర్ణంతో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
ఎంత మోతాదులో తీసుకోవాలి?
ఆరోగ్య నిపుణులు సూచన ప్రకారం రోజు మొత్తం మీద పసుపు వినియోగం 2000 మిల్లీ గ్రాములకి మించకూడదు. కనీసం 500 మిల్లీగ్రాముల పసుపు తీసుకోవడం తప్పనిసరి. పసుపు అధికంగా తీసుకునే వారిలో ఐరస్ లోపం కనిపిస్తుంది. ఇది శరీరం ఇనుమును శోషించుకునే గుణాన్ని తగ్గిస్తుంది. పసుపు అధికంగా తినడం వల్ల ఇనుము శోషణ 20 శాతం నుంచి 90 శాతానికి పడిపోతుంది. ఇది పసుపులో ఉండే స్టోయికియోమెట్రిక్ లక్షణాల వల్ల జరుగుతు
కాలేయాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
పసుపులో కర్కుమిస్ ఉండటం వల్ల ఇన్ఫమేషన్ను తగ్గించడంతోపాటు ఫైబ్రాయిడ్ల పురోగతిని మందగించడంలో సహాయపడుతుంది. పసుపులో ఉన్న క్యాన్సర్ నిరోధక గుణాలు కాలేయానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి అయితే అది పసుపును మితంగా తీసుకున్నప్పుడు మాత్రమే. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించబడిన కాలేయ పనితీరుపై జరిపిన అధ్యయనంలో కూడా అదే నిరూపితమైంది.