వ్యాధుల వేళ…రక్షణ ఇలా! రోగ నిరోధక శక్తి పెంపునకు సమతుల ఆహారం మేలు
ఉదయం అల్పాహారంలో ఉడకబెట్టిన గుడ్డు పై మిరియాల పొడి వేసుకొని తినాలి. పిల్లలకు, గర్భిణులకు రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వాలి. అల్పాహారంలో జొన్న లేదా గోధుమ రొట్టెలు లేదంటే రాగి జావ, జొన్న జావ, దోసెలు, ఇడ్లీలు, పెసరట్టు, మినపట్టు లాంటివి తీసుకుంటే సూక్ష్మ పోషకాలు ఎక్కువగా లభిస్తాయి.
* ఉదయం 10-11 గంటల సమయంలో ఈ కాలంలో దొరికే ఒక పండు
తినాలి. పండ్లరసాల కంటే నేరుగా తినడం మేలు.
మధ్యాహ్న భోజనంలో అన్నం, చపాతీ, తాజా ఆకుకూర, పప్పు, చికెన్, మిరియాల రసం లాంటి ఉండేలా చూసుకోవాలి. ఆకు కూరలు,
కూరగాయలు ఎప్పటికప్పుడు తాజావి తెచ్చుకొని, కడిగి వండుకోవాలి. చికెన్, మటస్ తాజావే తినాలి.
* కూరల్లో పసుపు, అల్లం, వెల్లుల్లి లాంటివి ఉండేలా చూసుకోవాలి. * భోజనం సాధ్యమైనంతవరకు రాత్రి 8 గంటలలోపు ముగించాలి.
చపాతీలు, ఆకు కూరలు, కూరగాయలతో చేసిన కూరతో తినాలి.