పాలలో పంచదార కాకుండా బెల్లం కలుపుకొని త్రాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అంతే కాక శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇది చాలా అవసరం. బెల్లంలో ఐరన్, పాలలోని కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. కాల్షియం ఎముకలకు గట్టి బలాన్ని ఇస్తుంది. బెల్లంలోని సుక్రోజ్, గ్లూకోజ్, ఖనిజాలు ఉన్నాయి. బెల్లంలో ఐరన్, పాలలోని కాల్షియం పుష్కలంగా ఉంటాయి. కాల్షియం ఎముకలకు గట్టి బలాన్ని ఇస్తుంది. బెల్లంలోని సుక్రోజ్, గ్లూకోజ్, ఖనిజాలు ఉన్నాయి. పాలల్లో లాక్టిక్ యాసిడ్, ప్రోటీన్స్, కాల్షియం, విటిమన్-ఎ,బి,డిలు ఉండడం వల్ల ఆరోగ్య పరంగా ఇవి రెండు మంచివి.

బెల్లం జీర్ణాశయ సంబంధిత సమస్యలను దరి చేరనివ్వదు. బెల్లం తీసుకున్న వెంటనే జీర్ణమవుతుంది. అంతేకాక పొట్టలో గ్యాస్ను ఉత్పత్తి చేయదు. కాబట్టి గ్యాస్ సమస్య ఉన్నవారు కూడా ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా త్రాగవచ్చు. మాములుగా ప్రతి రోజు ఉదయం బెల్లం పాలను త్రాగవచ్చు. నిద్రలేమి సమస్య ఉన్న వారు మాత్రం రాత్రి పడుకునే ముందు త్రాగితే నిద్ర బాగా పెట్టటమే కాకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది.

దగ్గు,జలుబు వానలు వస్తున్నాయి కదా ఇప్పుడు దగ్గు, జలుబు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా బెల్లం పాలను తాగవల్సిందే. అలాగే కీళ్లనొప్పులు ఉన్నవారికి మంచి ఉపశమనం కలుగుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. రక్తాన్ని శుద్ది చేస్తుంది. శరీరంలో మలినాలను తొలగిస్తుంది. ఉదయం సమయంలో బెల్లం కలిపిన పాలను తాగితే అలసట, నీరసం, నిస్సత్తువ లేకుండా రోజంతా
హుషారుగా ఉంటారు.