ఎండాకాలంలో దొరికే పండ్లలో మల్బరీ (కంబళి, తుత్తురు) ఒకటి. తియ్యగా, పుల్లగా ఉండే ఈ పండులో విటమిన్లు ఎక్కువ. ఈ ఫ్రూట్ ఇమ్యూనిటీని పెంచుతుంది కూడా. ఎండిన ఈ పండ్లను నేరుగా లేదా సలాడ్ లో, అంబలి, జావలో వేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది.

కంటి ఆరోగ్యానికి అవసరమైన కెరోటిన్, జియాగ్దాంతిన్ అనే కెరోటినాయిడ్లు ఉంటాయి. ఇవి కండ్ల అలసటను తగ్గించడమే కాకుండా కండ్లు పొడిబారకుండా చూస్తాయి.

మల్బరీ పండులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఈ పండు తింటే అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు రావు.

ఇందులోని కె, సి విటమిన్లు ఇమ్యూనిటీని పెంచుతాయి. ఫ్లూ, ముక్కు పట్టేయడం వంటి సమస్యలను తగ్గిస్తాయి. మల్బరీలోని విటమిన్-సి చిగుళ్లని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఈ పండు తింటే కొలెస్ట్రాల్, డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటాయి. అంతేకాదు జుట్టు రాలడం తగ్గిపోతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.