కిడ్నీలో రాళ్లను పిండి చేసే కొండపిండి ఆకు..
కిడ్నీలో రాళ్లు తగ్గించుకోవటం కోసం కొండపిండి మొక్క అద్భుతంగా పనిచేస్తుందట. ఈ మొక్క ఏంటో, దీని కథేంటో చూద్దామా..! మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు కొండపిండి వేర్లు, గోక్షూర వేర్లు, ఒలిమిడి వేర్లు, ఉత్తరేణి వేర్లను సమపాళ్లలో తీసుకుని మెత్తగా నూరి కుంకుడు గింజ పరిమాణంలో మాత్రలుగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ మాత్రలను మంచినీటితో కలిపి తీసుకోవడం వల్ల మూత్రపిండాలలో రాళ్ల సమస్య నయం అవుతుంది. ఆయుర్వేద షాపుల్లో ఇవి పేర్లు చెబితే మీకు ఇస్తారు.
ఆకులు దొరకని వారు ఆయుర్వేదం షాప్లో దొరికే కొండపిండి ఆకు పౌడర్ తెచ్చుకుని ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ పౌడర్ వేసి మరిగించి వడగట్టి ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా 20 రోజుల పాటు తాగితే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. కొండపిండి ఆకును పప్పుగా తయారు చేసుకొని కూడా తినవచ్చు. ఈ ఆకు తినడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాస్త ఓపిక ఉంటే.. ఇలా నాచురల్గా సమస్యలను తగ్గించుకోవచ్చు.