ప్రస్తుత వర్షా కాలంలో అనేక జనాలు అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. ముఖ్యంగా డెంగ్యూ వంటి సమస్యలు తీవ్ర ఇబ్బంది పెడతాయి.సీజనల్ వ్యాధులను తట్టుకోవాలంటే.. శరీరంలో రోగ నిరోధక శక్తి తప్పనిసరిగా ఉండాలి. అయితే, ఈ వర్షాకాలంలో సీజనల్ జబ్బుల నుంచి రక్షించుకోవడానికి కివి పండును తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ కివి పండులో విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ప్రస్తుత వర్షా కాలంలో అనేక జనాలు అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. ముఖ్యంగా డెంగ్యూ వంటి సమస్యలు తీవ్ర ఇబ్బంది పెడతాయి.సీజనల్ వ్యాధులను తట్టుకోవాలంటే.. శరీరంలో రోగ నిరోధక శక్తి తప్పనిసరిగా ఉండాలి. అయితే, ఈ వర్షాకాలంలో సీజనల్ జబ్బుల
నుంచి రక్షించుకోవడానికి కివి పండును తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ కివి పండులో విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
విటమిన్ సి కివీ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కివి
పండును రోజూ ఒకటి తినడం వలన శరీరానికి అవసరమైన సి విటమిన్ ను అందిస్తుంది. ఇందులో పీచు పదార్థం ఉదర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. కివిలో ఉండే విటమిన్ సి కంటెంట్.. నారింజ, నిమ్మకాలయ కంటే రెట్టింపు ఉంటుంది. ఇందులో విటమిన్ సితో పాటు, యాంటీ-ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల పనితీరును
మెరుగుపరుస్తాయి. కివీ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్తమా లక్షణాలు తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.