ఆస్థమా మామూలు జబ్బే. పూర్తిగా నియంత్రణలో ఉంచుకోదగిందే. అయినా దీని మూలంగా మనదేశంలో ఏటా లక్ష మంది మృత్యువాత పడుతున్నారు. అత్యవసరంగా ఆసుపత్రుల్లో చేరటానికి దారితీస్తున్న సమస్యల్లో ఆస్థమా మూడోది కావటం గమనార్హం. దీని నిర్ధరణ, చికిత్సలో విప్లవాత్మక మార్పులు వచ్చినా ఎందుకీ దుస్థితి? తెలిసో తెలియకో ఎక్కడో పొరపాటు జరుగుతోందనే విషయాన్ని ఇది చెప్పకనే చెబుతోంది. ఇప్పటికీ జబ్బుపై సరైన అవగాహన లేకపోవటం.. ఇన్‌హేలర్లను సరిగా వాడకపోవటం, వీటిపై నెలకొన్న అపోహలు, భయాల వంటివన్నీ సమస్య తీవ్రం కావటానికి దోహదం చేస్తున్నాయి. కాబట్టే ఆస్తమా చికిత్సలో లోటుపాట్లను పూరించాలని ప్రపంచ ఆస్థమా దినం నినదిస్తోంది.
ఆస్థమా.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని పట్టి పీడిస్తున్న సమస్య. మనదేశంలో సుమారు 3 కోట్ల మంది దీంతో బాధపడుతున్నారని అంచనా. సగటున పెద్దవారిలో 2-6% మంది.. పిల్లల్లో 6-20 % మంది ఆస్థమాతో సతమతమవుతున్నవారే. ఏటా 2.70 లక్షల మంది పిల్లలు ఆస్థమా చికిత్స కోసం ఆసుపత్రులకు వస్తున్నారు. ఇందుకోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఆస్థమాతో పిల్లలు కోటి బడి విభాగం దినాలకు దూరమవుతు ఉన్నారు. ఇవన్నీ పరిస్థితి తీవ్రతకు నిదర్శనాలే. వాయు కాలుష్యం, బద్దకంతో కూడిన జీనవశైలి, ఊబకాయం, కరోనా అనంతర దుష్ప్రభావాల మూలంగా ఇటీవల ఇది మరింత ఎక్కువగానూ విజృంభిస్తోంది. ఊబకాయంతో ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతుంది. ఎప్పుడూ ఇంట్లోనే కూర్చుంటే
బయట ఎండ తగలదు. శరీరానికి విటమిన్ డి దొరకదు. దీని లోపంతో ఆస్థమా ఉద్దృతమయ్యే అవకాశముంది. ప్రస్తుతం ఆస్థమా ఎక్కువ కావటానికి ఇలాంటివన్నీ దోహదం చేస్తున్నాబయట ఎండ తగలదు. శరీరానికి విటమిన్ డి దొరకదు. దీని లోపంతో ఆస్థమా ఉద్దృతమయ్యే అవకాశముంది. ప్రస్తుతం ఆస్థమా ఎక్కువ కావటానికి ఇలాంటివన్నీ దోహదం చేస్తున్నాయి.
యి.