నేరేడు.. సీజనల్ ఫ్రూట్. ఈ సీజన్ లోనే ఇవి విరివిగా దొరుకుతాయి. అయితే ఈ విషయాలు తెలుసుకుంటే మీరు అస్సలు మిస్ అవ్వరు. నేరేడులో ఎన్నో పోషక గుణాలు ఉంటాయి.

మనం ఫిట్ గా ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు బెస్ట్ ఆప్షన్. అందులో నేరేడు పండ్లు కూడా ఒకటి. జామూన్ చెట్టు మే, జూన్ నెలలో నేరేడు ఫలాలను ఇస్తుంది. తీపి, వాగర మిళితమై స్పెషల్ టేస్ట్ కలిగి ఉండే ఈ పండుకు రోగాలనూ నియంత్రించే శక్తి కుడా ఉంది. ఒక్క పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ సి అధికంగా లభిస్తుంది.

దీనివల్ల ఇమ్మ్యూనిటి పవర్ పెరుగుతుంది. ఆరోగ్య ఫల ప్రధాయిని నేరేడు పండు తినడం వలన కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.

చాల కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పోవడానికి నేరేడు పండ్లను తినడం మంచిది.
మొటిమలు, మధుమేహం, ఆర్తరైటిస్, దద్దుర్లు వంటి వాటికి ఇది ఉత్తమ నివారణగా ఔషధంగా పనిచేస్తుంది.
నేరేడు పండులో చెక్కెర తక్కువగా ఉంటుంది. దీనిని రొజూ తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.

పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలకు కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది.
నేరేడు పళ్లకు శరీరానికి చాలవ చేస్తాయి.
హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి కుడా ఈ ఫ్రూట్ సాయపడుతుంది.
దీర్ఘకాల వ్యాధులకు నివారణకు నేరేడు పండ్లను తినటం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది.
నేరేడు తినడం వల్ల తరచూ దప్పిక వేయడం, యూరిన్ కి పోవడం వంటి సమస్యలు అదుపులో ఉంటాయి.
నీరసం, నిస్సత్తువ ఉన్న వారు నేరేడు పండు ను తింటే తక్షణ శక్తి వస్తుంది.

జిగట విరేచనాలతో బాధపడే వారికి నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున ఇవ్వాలి. రోగికి శక్తితో పాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి.
ఆశ్తమా, బ్రాంకైటిస్ సమస్యలతో బాధపడేవారికి సైతం నేరేడు మంచిది.
ఈ పండులోని యాంటి ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధం గా పనిచేస్తాయి.
జ్వరంగా ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర తాపం తగ్గుతుంది.
పిండిపదార్థాలు, కొవ్వు భయం ఉండదు కనుక నేరేడు పండ్లను అధిక బరువు ఉన్నవారు..

మధుమేహం రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుండి ఎనిమిది దాక తినవచ్చు. బ్యూటీ విషయం లో కూడా నేరేడు ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. దీనిని తరచూ తినడం వల్ల చర్మంపై ముడతలు పడవు. వృద్ధాప్య చాయలు కూడా త్వరగా కనిపించవు.

అయితే నేరేడు పండ్లను గర్బినులు మాత్రం ఎటువంటి పరిస్తితుల్లో తినకూడదు. జామూన్ జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాని దాని అధిక మోతాదు వల్ల మలబద్ధకం సమస్య రావచ్చు. నేరేడు అరగడానికి ఎక్కువసమయం పడుతుంది కాబట్టి.. ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలి.