పీచుపదార్థాలతో డిమెన్షియాకు చెక్!
డైట్ శారీరక ఆరోగ్యం పైనే కాదు, మానసిక ఆరోగ్యంపైన కూడా ప్రభావం చూపుతుంది. పీచుపదార్థాలు(ఫైబర్) అధికంగా లభించే ఆహార పదర్థాలను తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చని, డిమెన్షియా వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చని ఇటీవలి అధ్యయనంలో వెల్లడయింది.
జపాన్ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం ప్రకారం “డిమెన్షియా రిస్క్ ను తగ్గించడంలో డైటరీ ఫైబర్ ముఖ్య మైన పాత్ర పోషిస్తున్నట్టు గుర్తించారు. 1980లో అధ్యయనం ప్రారంభించారు. 1985 నుంచి 1999 మధ్యకాలంలో 40 నుంచి 60 సంత్సరాలు ఉన్న 3739 మంది నుంచి డేటాను సేకరించి అధ్యయనం చేశారు. వారిని 2020 వరకు గమనించారు. 3739 మందిని వారు తీసుకుంటున్న ఫైబర్ అధారంగా నాలుగు గ్రూపులుగా విభజించారు. వీరిలో ఎక్కువ ఫైబర్ తీసుకున్న వారిలో డిమెన్షియా డెవలప్ అయ్యే రిస్క్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఫైబర్ లోనూ నీటిలో కరిగే ఫైబర్, కరగని పైబర్ ఉంటుంది. నీటిలో కరిగే ఫైబర్ ఓట్స్, సోయాబీన్స్, వేరుశనగ, శనగ వంటి వాటిలో ఉంటే, కరగని ఫైబర్ కూరగా యలు, మిల్లెట్లు, బ్రౌన్ రైస్ వంటి వాటిలో లభిస్తుంది.