పెద్దవాళ్లలో… కడుపునొప్పికి కారణాలు.. నివారణ
వయసు పై బడినవాళ్లు అన్నిరకాల ఫుడ్స్ ని జీర్ణం చేసుకోలేరు. అలాగే టైంకి తినరు. వీళ్లలో అజీర్తి మాత్రమే కాకుండా ఎసిడిటీ కూడా ఎక్కువే. అందుకని వాళ్లకు తొందరగా అరిగే ఫుడ్ పెట్టాలి. అలాగే కొందరు సరిపోను నీళ్లు తాగకపోవడం వల్ల ఎసిడిటీ బారిన పడతారు.
నూనె పదార్థాలు, జంక్ఫుడ్, చిప్స్ పాటు స్వీట్లు ఎక్కువ తినే పిల్లలు కడుపునొప్పి, ఎసిడిటీతో బాధపడతారు. అంతేకాదు కొందరు పిల్లలు గుర్తుచేస్తే తప్ప నీళ్లు తాగరు. దాంతో డీహైడ్రేట్ అవుతారు. శరీరంలో నీళ్లు తగ్గినా కూడా ఎసిడిటీ వస్తుంది. రెడీటు ఈట్ఫుడ్లోని ప్రిజర్వేటివ్స్ కూడా పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
కొన్నిసార్లు తిన్నది అరగదు. కడుపంతా టైట్గా ఉంటుంది. ఇదే కాకుండా పొట్టలో మంట… కడుపు నొప్పి, ఎసిడిటీ, అల్సర్స్, రక్తపు విరేచనాలు వంటివి చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్లనూ ఇబ్బంది పెడుతుంటాయి. ఇవన్నీ గ్యాస్టిక్ సమస్యల్లో భాగమే. టైంకి తినకపోవడం లేదా అస్సలు తినకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. బయటిఫుడ్, నూనెలో వేగించిన ఫుడ్, జంక్ఫుడ్ అరగక కడుపునొప్పి వస్తుంది. అందుకు కారణం… జంక్ఫుడ్లో మోనోసోడియం గ్లుటామేట్ వంటివి వేయడమే. బేకరీ ఫుడ్ ఉప్పు, కాల్షియం కూడా ఎక్కువ. ఇవి తింటే పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ పెరిగి, మంటగా ఉంటుంది.
ఫుడ్ తిన్న వెంటనే పొట్టలో జీర్ణరసాలు, యాసిడ్స్ విడుదలవుతాయి. టైంకి తినకుంటే ఈ యాసిడ్స్ వల్ల పొట్టలో మంటగా ఉంటుంది. దీన్నే ‘ఎసిడిటీ ‘ అంటారు. రోజూ మూడు లీటర్ల నీళ్లు తాగకున్నా, ఎక్కువ సేపు ఉపవాసం ఉన్నా కూడా ఎసిడిటీ వస్తుంది. కొందరిలో రక్తపు విరేచనాలు అవుతాయి. మలంలో రక్తం వస్తుంటే…. అది ఎర్రగా ఉందా? ముదురు రంగులో ఉందా? అనేది గమనించాలి. రక్తం ముదురు రంగులో ఉంటే పొట్టలో అల్సర్లు ఉన్నాయని అర్థం. అలాకాకుండా ఎర్రగా ఉంటే మల ద్వారంలో ఇన్ఫెక్షన్లు ఉన్నట్టు గ్రహించాలి. అన్నవాహిక, పొట్టలో క్యాన్సర్ గడ్డలు ఉన్నా కూడా రక్త విరేచనాలు అవుతాయి. అందుకని ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఎండోస్కోపి, కొలనోస్కోపి చేయించాలి.
నిద్ర తక్కువై…
పని ఒత్తిడి, నిద్రలేమి వల్ల చాలామంది స్లీపింగ్ టైమింగ్స్ పాటించరు. రాత్రి పదకొండు నుంచి ఉదయం నాలుగ్గంటల వరకు కార్టిసాల్ జీరో
అవుతుంది. ఆ టైంలో కచ్చితంగా నిద్రపోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్ల కారణంగా కూడా ఎసిడిటీ వస్తుంది.