బ్రౌన్ రైస్ బాగా పాలిష్ చేయడం వలన వైట్ రైస్ గా మారిపోతున్నాయి. బ్రౌస్ రైస్ ని పాలిష్ చేయడం వల్ల దానిపై ఉండే పొర తొలగిపోయి అలాగే అందులో ఉండే ఎన్నో రకాల పోషకాలు కూడా పోతుంటాయి. వాటి వలన పోషకాలు మొత్తం ఎగిరిపోయి. నిసారమైన పిండి పదార్థం మాత్రమే మిగులుతోంది. కాబట్టి పాలిష్ వేయని రైస్ ని తీసుకోవాలని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. రైస్ లో ఉండే ఎన్నో రకాల పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తూ ఉంటాయి.

క్యాన్సర్ – రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, దంత క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్, లాంటి ఎన్నో రకాల క్యాన్సర్లు ఉన్న వారు బ్రౌన్ రైస్ ను తీసుకోవచ్చు. ఈ రైస్లో ఐనాసిటాల్ , హేగ్గా పాస్పేట్, అని సాధారణమైన సమ్మేళనం దీనిలో కలిగి ఉంటుంది. అలాగే డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండడం వలన పేగుల క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ముడి బియ్యం లో పాలిఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయి.

గుండెకు శ్రేయస్కరం : ముడి బియ్యం తీసుకోవడం వలన కార్డియాక్ అరెస్ట్ గుండెపోటు లాంటి తీవ్రమైన వ్యాధులు రాకుండా కాపాడుతాయి. అలాగే అధిక బరువు ఉన్న వారికి ముడి బియ్యం తినమని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. మధుమేహం : పాలిష్ చేసిన రైస్ గ్లైసిమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. ముడి బియ్యం లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈ అన్నం తీసుకోవడం వలన చక్కెర స్థాయిలు వెంటనే పెరగవు. కాబట్టి ముడి బియ్యం మధుమేహం ఉన్నవారు కి బాగా సహాయపడతాయి.

కొవ్వుని కరిగిస్తుంది : ముడి బియ్యం కొలెస్టాల్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. అదే కాకుండా ఈ బియ్యం వాడడం వలన మంచి కొలెస్టాల్ లెవెల్స్ ని కూడా పెరుగుతాయి. అలాగే దీనిని వాడడం వల్ల శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఈ రైస్ నిత్యము తీసుకోవడం వలన స్థూలకాయాన్ని తగ్గించడం, శరీరంలోని తీవ్రమైన నొప్పిని, షుగర్ వ్యాధిని కూడా తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.