మామిడి నానబెట్టుడు కరెక్టే
మామిడి పండుని కాసేపు నీళ్లలో నానబెట్టాలి. ఆ తరువాతే తినాలి’ అని పెద్దవాళ్లు చెపుంటారు. ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోవద్దు. ‘మామిడి పండుని నీళ్లల్లో నానబెట్టడమనేది మురికి పోవడానికే కదా అంటున్నారా? అది కూడా ఒక పాయింట్. కానీ, దాంతో పాటు మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి అవేంటంటే….
మామిడి పండులో ఫైటిక్ యాసిడ్ అనే పోషకం ఎక్కువ ఉంటుంది. ఇది చాలారకాల పండ్లు, కూరగాయల్లో కూడా ఉంటుంది. ఫైటిక్ యాసిడ్ శరీరానికి మంచితో పాటు చెడు కూడా చేస్తుంది. శరీరంలో యాసిడ్ ఎక్కువైతే , శరీరానికి కావాల్సిన మినరల్స్, ఐరన్, జింక్, క్యాల్షియం లను అందకుండా చేస్తుంది. దాంతో రకరకాల రోగాల బారిన
పడే అవకాశాలు ఎక్కువ అందుకే కొన్ని గంటలపాటు మామిడి పండ్లను నీళ్లలో నానబెట్టి అందులో ఎక్కువగా ఉన్న పైటిక్ యాసిడ్ పోతుంది. పోషకాలన్నీ అంది బాడీ బ్యాలెన్స్ గా తయారవుతుంది.
మామిడి పండ్లను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వేడి బాగా పెరుగుతుంది. దానివల్ల మొటిమలు, తలనొప్పి, మలబద్దకం, జీర్ణ సమస్యలు వస్తాయి. అదే నానబెట్టి తింటే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. పైగా ఆరోగ్యానికి ఫైటిక్ కూడా చాలా మేలు చేస్తాయి..
నానబెట్టడం వల్ల మామిడి పండులో ఉన్న ఫైటో కెమికల్ స్థాయి తగ్గుతుంది. దాంతో
నేచురల్ గా శరీరంలో ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. శరీర టెంపరేచర్ పెరగడం ద్వారా థర్మోజెనెసిస్ ఉత్పత్తి అవుతుంది. అది క్యాలరీలను కరిగిస్తుంది. దాంతో హెల్దీగా, తేలికగా బరువు తగ్గుతారు.
కాసిన మామిడిపండ్లకు రోగాలు రాకుండా, పురుగు పట్టకుండా ఉండటానికి కెమికల్స్ నిండిన పురుగు మందులు చల్లుతుంటారు. అవి మొక్కల్ని చీడపీడల నుంచి కాపాడినప్పటికి మన శరీరానికి మాత్రం విషంగా మారతాయి. తరువాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి శ్వాస సంబంధిత. సమస్యలు వస్తాయి. అలర్జీ, తీవ్రమైన తలనొప్పి, కళ్ల దురద,వికారం లాంటి సమస్యలు కూడా చుట్టుముడతాయి. ఈ సమస్యలేవీ రాకుండా ఉండేందుకే పండ్లని నీళ్లలో కొన్ని గంటలపాటు ఉంచాలి అంటారు.