రేగు పళ్ళతో ఆరోగ్యం
రేగు పళ్లలో పోషకాలు, ఔషధ గుణాలు ఎక్కువ. వీటిలో విటమిన్ సి, కె, పొటాషియం అధికం. వీటితో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటివి దూరమవుతాయి. ఒత్తిడిగా ఉన్నప్పుడు నాలుగు పండ్లు తింటే ఫలితం ఉంటుంది. రేగులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. కాలేయం పని తీరును మెరుగుపరుస్తుంది. మనికి అవసరమయ్యే 24 రకాల అమైనో ఆమ్లాలలో 18 రేగులో లభిస్తాయి. వీటిల్లోని సుగుణాలు.. చర్మానికి మేలు చేస్తాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్దకం ఉండదు. ఆకలిని పెంచుతుంది.
నీరసంగా ఉన్నప్పుడు కొన్ని రేగు పళ్లు తిని చూడండి. వీటిల్లోని ఎనర్జీ బూస్టర్లు తక్షణ శక్తినిస్తాయి. పిల్లలకు చాలా మంచివి. మందమతులుగా ఉన్న పిల్లలచేత రోజూ కాసిన్ని రేగపండ్లు తినిపిస్తే బుద్ధి వికసిస్తుందట. ఈ చెట్టు ఆకులు, బెరడు, గింజల్లో కూడా ఔషధ గుణాలున్నాయి. ఆకు పసరును పండ్లకి పై పూతగా వాడితే త్వరగా తగ్గుతాయి. వీటిలోని క్యాల్షియం పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు కండరాలనూ, దంతాలనూ, ఎముకల్నీ దృఢంగా మారుస్తాయి. రక్తం శుద్ధి అవుతుంది. గొంతునొప్పిని, ఆస్తమా, కండరాల నొప్పిని తగ్గించే గుణం వీటిలో ఉంది. రేగు గింజలను పొడి చేసి నూనెతో కలిపి రాసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.