రోజువారి వ్యాయామాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మనల్ని ఆక్టివ్ గా ఉండేలా చేయటంతోపాటు, మనసుకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. రోజువారి వ్యాయామాలను ఒక ప్రక్రియగా కొనసాగించటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రత్యకంగా రోజులో ఏదో ఒక సమయం వ్యాయామాలకు కేటాయించాలి. తొలినాళ్ళల్లో ఉత్సాహంగానే వ్యాయామాన్ని ప్రారంభించినా తరువాత మధ్యలోనే అపేస్తుంటారు. రోజువారి వ్యాయామాలను అకస్మాత్తుగా మానేయటం వల్ల అనర్ధాలు తప్పవంటున్నారు నిపుణులు.

అకస్మాత్తుగా వ్యాయామాలు ఆపేయడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోయి, బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. 15 రోజుల పాటు వ్యాయామం మానేసినా కండరాల మోతాదు తగ్గుతోందని, కొవ్వు శాతం పెరిగిపోతోందని అధ్యయనాల్లో తేలింది. వ్యాయామం ఆపేయడం మూలంగా మధుమేహం, గుండెజబ్బుల వంటి దీర్ఘకాలిక సమస్యల ముప్పూ ఎక్కువవుతోందని నిపుణులు అంటున్నారు. వ్యాయామం మానేసిన సమయంలో రక్తపోటు సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. సడన్ గా వ్యాయామం మానేస్తే శ్వాస సమస్యలు అధికమవుతాయి.

వ్యాయామాన్ని సడన్ గా ఆపేయడం వలన మెదడు లో చురుకుదనం తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. క్రమం తప్పకుండా | వ్యాయామం చేయడం వల్ల శరీరం ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. దీనివల్ల మనసు ఆహ్లాదంగా మారుతుంది. నిరాశ, ఒత్తిడిని తగ్గించుకోవచ్చు వ్యాయామాలు అపేయటం వల్ల ఒత్తిడి అధికమౌతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. శరీరంలోని కండరాలు వ్యాయామాల మధ్యలో అపేయటం వల్ల పటుత్వాన్ని కోల్పోవడం తో పాటుగా శరీరంలో కెలొరీలు కూడా చాలా తక్కువగా ఖర్చువుతాయి. కండరాలు నొప్పిగా, అలసట గా అనిపించి నీరసం వస్తుంది.