సరైన ఆహారం తీసుకున్నప్పుడే సంపూర్ణ ఆహారం
ఆకుకూరలు… వీటిలో ఐరన్, క్యాల్షియం, మెగ్నీ షియం , విటమిన్లు సి, కె మెండుగా ఉంటాయి. ఇవి రక్తహీనత లేకుండా, ఎముకలు బలంగా ఉండటానికి సాయపడతాయి.
నట్స్.. ఈ ఎండుగింజల్లో విటమిన్లు, మినరల్స్, కొవ్వులు మెండుగా ఉంటాయి. ఇవి ఎముక ఆరోగ్యంతోపాటు మెదడునూ చురుగ్గా ఉంచుతాయి. కాబట్టి రోజూ బాదం, కాజూ, వాల్నట్స్, పిస్తాలన్నీ కలిపి ఓ గుప్పెడైనా తినేయండి.
టొమాటోలు… ఇవి రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయట. అలాగే గుండె సంబంధ సమస్యలను కూడా కూడా అడ్డుకుంటాయి.
అవిసె గింజలు… ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, పీచు మెండుగా ఉంటాయి. వీటిలోని లిగ్నన్స్ అనే సమ్మేళనాలు స్త్రీలలో మెనోపాజ్ సమయంలో వచ్చే వేడి ఆవిర్లు, చెడుకొలెస్ట్రాల్ ను తగ్గిసాయి. అంతే కాదు రొమ్ము క్యాన్సర్ రాకుండా పోరాడతాయి.
క్యారెట్… ఇది నాడులకు శక్తిని అందిస్తుంది. దీనిలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. మెండుగా ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యంతోపాటు చర్మాన్ని మెరిపిస్తుంది.
గ్రీన్ టీ… ఇది క్యాన్సర్ కారకాలు, గుండె జబ్బులతో పోరాడతుంది. అంతేకాదు మతిమరుపుని అడ్డుకుంటుంది.
వీటన్నింటితోపాటు అరటిపండు, అవకాడో, డార్క్ చాక్లెట్, యాపిల్స్, చేపలు, బ్రకోలీ, పాలు, సోయా, పెరుగు, గుడ్లను ఆహారంలో చేర్చుకోవాలి. నీళ్లు శరీరం లోని మలినాలు, విషపదార్థాలను బయటకు పంపు తాయి. ఇందుకోసం రోజులో ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తాగాలి.