ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మంచి పోషకాలు ఉన్న ఆహారం తింటూ కనీసం రోజులో అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తూ, ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే అధిక బరువు సమస్య, శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును కరిగించుకోవచ్చు.

250 గ్రాముల మెంతులు., 100 గ్రాముల వాము, 50గ్రాములు నల్ల జీలకర్ర తీసుకుని ఈ మూడింటిని పాన్ లో వేసి దోరగా వేగించాలి. వేగిన వీటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ప్రతిరోజు రాత్రి సమయంలో భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ పొడి వేసి బాగా కలిపి తాగాలి. ఈ డ్రింక్ తాగిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోకూడదు.

ఈ విధంగా ఒక 15 రోజుల పాటు చేస్తే తేడా మీరే గమనించవచ్చు. శరీరంలో విషాలు అన్ని బయటకు తొలగిపోతాయి. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. చెడు కొలెస్టాల్ కరిగిపోతుంది. రక్తం శుభ్రపడుతుంది. అధిక బరువు తగ్గడమే కాకుండా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది. అలాగే బరువు తగ్గినప్పుడు ఎముకలు బలహీనంగా మారకుండా కూడా ఈ పొడి సహాయపడుతుంది.